Andhra Pradesh: అమరావతిలో మరో మరణం... వెంకటేశ్వరావు అనే రైతుకూలీ మృతి

  • గుండెపోటుతో మరణించిన రైతు కూలీ
  • వెంకటేశ్వరరావు స్వగ్రామం వెంకటపాలెం
  • ప్రతిరోజూ రాజధాని ఆందోళనల్లో పాల్గొంటున్నట్టు గ్రామస్తులు వెల్లడి

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల ఆందోళనలు తీవ్రస్థాయికి చేరిన తరుణంలో మల్లికార్జునరావు అనే రైతు మృతి చెందడం తెలిసిందే. తాజాగా రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో ఓ రైతుకూలీ మరణించాడు. వెంకటేశ్వరరావు అనే రైతుకూలీ గుండెపోటుతో మృతి చెందాడు. వెంకటేశ్వరరావు ప్రతిరోజూ అమరావతి ఆందోళనల్లో పాల్గొంటున్నాడని గ్రామస్తులు తెలిపారు. రాజధాని మార్పుపై మనోవేదనతోనే మృతి చెందాడని గ్రామస్తులు చెబుతున్నారు.

More Telugu News