Crime News: మొబైల్ ఫోన్లతో కోహ్లీ చిత్రం.. ఆశ్చర్యపోయిన విరాట్.. ఉబ్బితబ్బిబ్బయిన అభిమాని.. వీడియో ఇదిగో

  • కోహ్లీకి అసోంకు చెందిన అభిమాని గిప్ట్
  • దానిపై ఆటోగ్రాఫ్ చేసిన కోహ్లీ
  • ఈ రోజు సాయత్రం నుంచి శ్రీలంక, టీమిండియా మధ్య టీ20

పాత మొబైల్ ఫోన్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిత్రాన్ని రూపొందించాడు అసోంకు చెందిన ఓ అభిమాని. దీన్ని చూసిన కోహ్లీ అతడి ప్రతిభకు ఆశ్చర్యపోయాడు. ఈ రోజు సాయత్రం నుంచి శ్రీలంక, టీమిండియా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో కోహ్లీకి ఆ అభిమాని ఈ చిత్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. దానిపై కోహ్లీ ఆటోగ్రాఫ్ చేస్తుండగా తీసిన ఫొటోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీన్ని రూపొందించడానికి తనకు మూడు రోజులు పట్టిందని అభిమాని రాహుల్ పరెక్ చెప్పాడు.

'మొబైల్ ఫోన్లు, వైర్లతో నేను ఈ చిత్రాన్ని గీశాను. మూడు రోజులు, మూడు రాత్రుళ్లు కష్టపడి దీన్ని పూర్తి చేశాను. కోహ్లీ సర్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఆయన నన్ను కలవడానికి వస్తున్నప్పుడు నా గుండె వేగం పెరిగింది. శ్రీలంకతో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి కోహ్లీ గువాహటికి వస్తున్నాడని నాకు కొన్ని నెలల ముందే తెలిసింది'అని చెప్పాడు.

More Telugu News