sabarimala: శబరి ఎక్స్‌ప్రెస్‌లో మద్యం మత్తులో జవాన్ల దురుసు ప్రవర్తన

  • అయ్యప్ప భక్తులపై దాడి
  • తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు
  • ఇద్దరు జవాన్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అయ్యప్ప భక్తులతో కొందరు జవాన్లు దురుసుగా ప్రవర్తించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. శబరి ఎక్స్‌ప్రెస్‌లో అయ్యప్ప భక్తులు ప్రయాణం చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో జవాన్లు.. అయ్యప్ప భక్తులపై దాడి చేశారు. శబరిమల నుంచి అయ్యప్ప భక్తులు హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 ఈ ఘటనపై తిరుపతి రైల్వే పోలీసులకు అయ్యప్ప భక్తుల బృందం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు శ్రీకాకుళంకు చెందిన ఇద్దరు జవాన్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. 

More Telugu News