Results: 'క్యాట్'లో వరంగల్ విద్యార్థుల సత్తా!

  • 'క్యాట్' ఫలితాల విడుదల
  • 10 మందికి 100 పర్సంటైల్
  • ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు

2020-21 సంవత్సరానికిగాను ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్)లలో ఎంబీఏ ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ఫలితాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 1.34 లక్షల మంది పురుషులు, 75 వేల మంది మహిళలు ఈ పరీక్షలు రాయగా, వరంగల్ నిట్ విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు వచ్చాయి. 100 శాతం మార్కులు 10 మంది విద్యార్థులకు రాగా, వీరందరూ డిగ్రీలో ఇంజనీరింగ్ నేపథ్యమున్న వారే కావడం గమనార్హం. తెలంగాణకు చెందిన ఓ విద్యార్థికి 100 పర్సంటైల్ వచ్చింది. మరో 21 మందికి 99. పర్సంటైల్ లభించగా, ఇందులో 19 మంది ఇంజనీరింగ్ నేపథ్యమున్నవారే.

More Telugu News