Bajji: వేడివేడిగా బజ్జీలు తినాలనుకున్న యువతి... గొంతులో ఇరుక్కుని మృతి

  • చెన్నైలో ఘటన
  • భర్తతో గొడవలతో పుట్టింట్లో ఉంటున్న పద్మావతి
  • తల్లి వేసిన బజ్జీలను ఆత్రంగా తిన్న యువతి
  • గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మృతి

మిరపకాయ బజ్జీలు అంటే నోరూరని వాళ్లు చాలా అరుదు. ముఖ్యంగా వర్షాకాలంలో వేడివేడి బజ్జీలు తినడం కొందరికి ఓ కమ్మని అనుభూతి. కానీ, చెన్నైలో ఓ యువతి బజ్జీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. చెన్నైలోని కామరాజర్ నగర్లో నివాసం ఉంటే పద్మావతి, గంగాధర్ దంపతులకు పిల్లల్లేరు. పెళ్లయి దశాబ్దం దాటినా పద్మావతి కడుపున ఒక్క నలుసు కూడా పుట్టలేదు. దానికి తోడు కుటుంబ కలహాలు!

ఈ నేపథ్యంలో పద్మావతి భర్త గంగాధర్ తో గొడవపడి పుట్టింట్లో ఉంటోంది. అయితే, తల్లి వేడివేడిగా బజ్జీలు వేస్తుండడంతో జిహ్యచాపల్యంతో ఒక్కసారిగా బజ్జీలను ఆబగా తినే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఓ బజ్జీ గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు విడిచింది. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. పద్మావతి అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.

More Telugu News