Allu Arjun: ముందు నిర్ణయించిన ప్రకారమే రిలీజ్ అవుతున్న 'అల.. వైకుంఠపురములో'

  • బన్నీ హీరోగా త్రివిక్రమ్ చిత్రం
  • జనవరి 12న రిలీజ్
  • విడుదల తేదీ మారిందంటూ ప్రచారం
  • కొట్టిపారేసిన నిర్మాణ సంస్థ

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అల... వైకుంఠపురములో' చిత్రం సంక్రాంతి కానుకగా వస్తోంది. వాస్తవానికి ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించినా, కొన్నిరోజులుగా డేట్ మార్చుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సినిమా నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి గందరగోళం అక్కర్లేదని, ముందు చెప్పినట్టుగానే జనవరి 12న రిలీజ్ అవుతోందని వెల్లడించింది. ఇదో భారీ కుటుంబ సంబరం అనడంలో సందేహం లేదని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ట్వీట్ చేసింది.

More Telugu News