Telangana: కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది: లక్ష్మణ్

  • మీడియాతో మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్
  • కేటీఆర్ పట్టాభిషేకం అంటూ వ్యాఖ్యలు
  • సోనియా చేసిన తప్పును కేసీఆర్ చేయదల్చుకోలేదని కామెంట్

బీజేపీ తెలంగాణ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సీఎం కాలేడని అన్నారు. రాహుల్ గాంధీ విషయంలో సోనియా చేసిన తప్పును కేసీఆర్ చేయదల్చుకోలేదని, అందుకే పురపాలక ఎన్నికలు పూర్తయిన తర్వాత కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం నిశ్చయించారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెనుక ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుట్ర ఉందని అన్నారు.

More Telugu News