Kesineni Nani: ఇది బీసీజీ రిపోర్టు లాగా లేదు, జగన్ మోహన్ రెడ్డి గారూ: కేశినేని నాని

  • బీసీజీ నివేదికపై కేశినేని నాని విమర్శ
  • సన్న బియ్యం సన్యాసి గాడు ఇచ్చిన రిపోర్టు లాగా ఉంది 
  • ఓ వైసీపీ నేతను ఉద్దేశించి ట్వీట్

అమరావతి నిర్మాణం అసాధ్యమని, అక్కడ అసెంబ్లీ, హైకోర్టు బెంచి ఉంటే చాలని ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. 'ఇది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రిపోర్టు లాగా లేదు జగన్ మోహన్ రెడ్డి గారు... సన్న బియ్యం సన్యాసి గాడు ఇచ్చిన రిపోర్టు లాగా ఉంది' అంటూ ఓ వైసీపీ నేతను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. కాగా, రాజధాని అంశంపై వచ్చిన నివేదికలపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది.

More Telugu News