Road Accident: శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టిన కారు.. ఐదుగురి మృతి

  • మందస మండలం కొత్తపల్లి వంతెన వద్ద ప్రమాదం
  • కల్వర్టును ఢీ కొట్టిన అనంతరం కాల్వలోకి దూసుకెళ్లిన కారు
  • సింహాద్రి అప్పన్నను దర్శించుకొని వెళ్తుండగా ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మందస మండలం కొత్తపల్లి వంతెన వద్ద ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కల్వర్టును ఢీ కొట్టిన అనంతరం ఆ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాద స్థలిలోనే ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, మరొకరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

గాయాలపాలైన వ్యక్తిని పోలీసులు సోంపేటలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకొని కుటుంబం భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో దంపతులు ప్రతాప్, రీతూ ఉన్నారని పోలీసులు వివరించారు. గాయాలతో బయటపడిన వ్యక్తి పేరు త్రిలోచన కన్నాగా పోలీసులు గుర్తించారు.

More Telugu News