Allu Arjun: సెన్సార్ పూర్తి చేసుకున్న 'అల వైకుంఠపురములో'

  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'అల వైకుంఠపురములో'
  • సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ 
  • జనవరి 12వ తేదీన భారీ విడుదల

త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' చిత్రం రూపొందింది. అల్లు అర్జున్ .. పూజా హెగ్డే నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాలో 'టబు' కీలకమైన పాత్రను పోషించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.

గీతా ఆర్ట్స్ .. హారిక అండ్ హాసిని వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. తమన్ బాణీలు పాప్యులర్ కావడంతో, ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. త్రివిక్రమ్ - బన్నీ కాంబినేషన్లో మరో హిట్ పడిపోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News