Allu Arjun: బన్నీ .. విలన్ కాంబినేషన్లోని కామెడీ హైలైట్ గా నిలుస్తుందట

  • విడుదలకి ముస్తాబవుతున్న 'అల వైకుంఠపురములో'
  • ప్రతినాయకుడి పాత్రలో సముద్రఖని
  • హ్యాట్రిక్ హిట్ ఖాయమంటున్న ఫ్యాన్స్

అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విలన్ గా తమిళ నటుడు సముద్రఖని నటించాడు. అయితే ఆయన పాత్ర తీరుతెన్నులు ఎలా వుంటాయనే ఆసక్తి అందరిలోనూ వుంది.

సముద్రఖని ఈ సినిమాలో కామెడీ విలన్ గా కనిపిస్తాడట. హీరో .. విలన్ కాంబినేషన్లోని కామెడీ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇంతవరకూ చేయని పాత్రలో సముద్రఖని కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక టబు .. రాజేంద్ర ప్రసాద్ .. మురళీశర్మ .. జయరామ్ పాత్రలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయని అంటున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో బన్నీ - త్రివిక్రమ్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

More Telugu News