Amaravathi: రైతులారా జాగ్రత్త! అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడు: అంబటి రాంబాబు

  • చంద్రబాబు కుట్ర స్వభావం కలిగినవాడు
  • అధికారం కోసం దేనికైనా తెగించే బాబును నమ్మొద్దు
  • రైతులకు ఇదే నా విజ్ఞప్తి

రాజధాని అమరావతిలో మెర్సీ కిల్లింగ్స్ చేసుకునే పరిస్థితి వస్తుందంటూ రైతులతో రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి  చంద్రబాబు లేఖలు కూడా రాయించారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘రైతులారా జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండండి, చంద్రబాబునాయుడు గారు కుట్ర స్వభావం కలిగిన వాడు. అధికారం కోసం ఏమైనా చేస్తాడు. రాజధానిలో హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించే ప్రమాదం ఉంది. అధికారం కోసం దేనికైనా తెగించే చంద్రబాబునాయుడుగారిని నమ్మవద్దని విజ్ఞప్తి’ అని అన్నారు.

భళారే విచిత్రం.. భూమి అంటే ఎంత ప్రేమ భువనేశ్వరి గారికి?

చంద్రబాబు భార్య భువనేశ్వరి తన బంగారు గాజును నిన్న అమరావతి పరిరక్షణ సమితికి విరాళంగా ఇవ్వడంపై అంబటి విమర్శలు చేశారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో రాష్ట్రం భగ్గున మండిపోయినప్పుడు, సమైక్య నినాదంతో ప్రజలు రగిలిపోయినప్పుడు, హైదరాబాద్ మనకు కాకుండా పోయినప్పుడు కూడా భువనేశ్వరికి ప్రజలపై జాలి కలగలేదని అన్నారు. ‘భళారే విచిత్రం.. భూమి అంటే ఎంత ప్రేమ భువనేశ్వరి గారికి?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన భర్త, కుమారుడు బినామీల పేరిట కొనుగోలు చేసిన భూముల కోసం దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారంటే ‘శభాష్.. గొప్పగా చెప్పుకోవాలి’ అంటూ ఎద్దేవా చేశారు.

More Telugu News