srireddy: నా ఆడి కారుకు గీతలు గీసి ధ్వంసం చేశారు.. అతనిపై అనుమానం ఉంది!: పోలీసులకు శ్రీరెడ్డి ఫిర్యాదు

  • ప్రస్తుతం చెన్నైలో శ్రీరెడ్డి
  • అన్భునగర్‌లోని ఒక ఫ్లాట్‌లో నివసిస్తున్న నటి
  • కార్ల పార్కింగ్ పై గొడవ

సినీ నటి శ్రీరెడ్డి  ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. అక్కడి అన్భునగర్‌లోని ఒక ఫ్లాట్‌లో నివసిస్తున్న ఆమె తాజాగా కోయంబేడు పోలీసులకు ఓ విషయంపై ఫిర్యాదు చేశారు. తాను నివసిస్తోన్న ఇంటి సమీపంలో విశ్రాంత పోలీస్‌ అధికారి బంగ్లా ఉందని తెలిపిన ఆమె... అందులో గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్‌ జరుగుతోందని చెప్పారు.

అక్కడ పలు కార్లను పార్కింగ్ చేస్తున్నారని ఆమె తెలిపారు. ఇటీవల రాత్రి ఫ్లాట్ కు వచ్చిన తనకు తన ఇంటి ముందు ఒక వాహనం పార్క్ చేసి కనపడిందని చెప్పారు. దీంతో తన కారును బయట పెట్టానని తెలిపారు. ఆ తరువాత కొద్ది సేపటికి వచ్చి చూస్తే తన ఆడి కారుకు గీతలు గీసి ధ్వంసం చేసి ఉండటం చూశానని వివరించారు. ఆ ప్రాంతంలో షూటింగ్‌ చేస్తున్న చిత్ర కార్యనిర్వాహకుడు మనోజ్‌పై తనకు అనుమానంగా ఉందని తెలిపారు.

More Telugu News