Rayalaseema: కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు... ఏడుగురిపై వేట కొడవళ్లతో దాడి!

  • కోసిగి ప్రాంతంలో ఘటన
  • నిమ్మయ్య కుటుంబంపై దాడి
  • కేసు నమోదు చేసిన పోలీసులు

గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమలోని కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ భూతం పడగ విప్పింది. ఏడుగురిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో ఈ ఉదయం దాడికి దిగడం తీవ్ర కలకలాన్ని రేపింది. దాడికి గురైన బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

జిల్లా పరిధిలోని కోసిగిలో ఈ ఘటన చోటు చేసుకోగా, నిమ్మయ్య అనే వ్యక్తి కుటుంబానికి చెందిన వారిపై అనుమేశ్ అనే వ్యక్తి కుటుంబీకులు దాడి చేసినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు భారీ ఎత్తున బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రెండు కుటుంబాల మధ్యా గొర్రెల విషయంలో వివాదాలు ఉన్నాయని తెలుస్తోంది. ఘటనపై కేసును నమోదు చేశామని, విచారిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News