Road Accident: ఎస్సైను కారుతో ఢీ కొట్టిన యువకులు... తీవ్రగాయాలు

  • వికారాబాద్ లోని నవాబ్ పేట్ ఎస్సై కృష్ణకు హైదరాబాద్ లో చికిత్స 
  • అనంతగిరిలో వాహనాలు తనిఖీ చేస్తోన్న సమయంలో ఘటన
  • నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

వికారాబాద్ లోని నవాబ్ పేట్ ఎస్సై కృష్ణను కొందరు యువకులు కారుతో ఢీ కొట్టారు. వారు ఉద్దేశ పూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారా? అన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఎస్సై కృష్ణ తీవ్రగాయాలతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతగిరిలో వాహనాలు తనిఖీ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో నలుగురు ఈ ఘటనకు పాల్పడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు టోలీచౌక్ కు చెందిన ఇమ్రాన్, అన్వర్, నవీద్, సమీర్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఆయన అందిస్తోన్న సేవలను అభినందిస్తున్నానని అన్నారు.

More Telugu News