Andhra Pradesh: మందుబాబులకు న్యూ ఇయరా.. మజాకా.. ఏపీలో రూ.92 కోట్లు తాగేశారు!

  • ఏపీలో పోటెత్తిన మద్యం అమ్మకాలు
  • 1.65 లక్షల కేసుల లిక్కర్, 60 వేల కేసుల బీర్ల అమ్మకాలు
  • రెండు రోజుల్లో కలిపి రూ.170 కోట్ల మద్యం ఉఫ్

న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31 రాత్రి ఏపీలో ఏకంగా రూ.92 కోట్ల విలువైన మద్యాన్ని గుటుక్కు మనిపించేశారట. డిసెంబరు 30, 31వ తేదీల్లో భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ ద్వారా తెలిసింది. సాధారణంగా సగటున రోజుకు రూ.60 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతుండగా, డిసెంబరు 30, 31 తేదీల్లో అంతకుమించి అమ్మకాలు జరిగాయి. ఫలితంగా ఈ రెండు రోజుల్లో ఏకంగా రూ.170 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి. వీటిలో బీర్, లిక్కర్ ఉన్నాయి. బుధవారం ఒక్క రోజే 1.65 లక్షల కేసుల లిక్కర్‌, 60 వేల కేసుల బీరు అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి న్యూ ఇయర్‌ను మందుబాబులు ఎంత ఘనంగా ఆహ్వానించారో అర్థం చేసుకోవచ్చు.

More Telugu News