Tirumala: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల!

  • 18 కంపార్టుమెంట్లలో భక్తులు
  • స్వామి దర్శనానికి 16 గంటల సమయం
  • నిన్న రూ. 3.50 కోట్ల హుండీ ఆదాయం

తిరుమల సప్తగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆంగ్ల నూతన సంవత్సరం రోజున స్వామి వారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్టుమెంట్లూ నిండిపోయాయి. స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతుందని, అంతవరకూ ఓపికగా వేచి చూడాలని టీటీడీ అధికారులు కోరారు.

దివ్య దర్శనం, ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన వారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న మంగళవారం నాడు స్వామిని 88,262 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,706 మంది తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.50 కోట్ల ఆదాయం లభించింది.

More Telugu News