Actress: ద‌క్షిణాదిలో హీరో కంటే హీరోయిన్‌ను త‌క్కువ‌గా చూస్తారు: నేహా ధూపియా

  • నిర్మాత‌లు ముందుగా హీరోకే భోజనాన్ని ఏర్పాటు చేశారు 
  • నేను చాలా ఆక‌లితో ఉన్నా..నిర్మాతలు పట్టించుకోలేదు
  • ఇది చాలా ఏళ్ల క్రితం జ‌రిగింది.. మరిచిపోలేకపోతున్నా

దక్షిణాది హీరోలు, దర్శకులపై బాలీవుడ్ భామలు ఏదో ఒక సందర్భంలో కామెంట్ చేయడం సాధారణంగా మారింది. తాప్సీ, ఇలియానా.. ఇలా చాలామంది హీరోయిన్లు గతంలో ఏదో ఒక కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నేహా ధూపియా కూడా చేరింది. ప్ర‌స్తుతం టీవీ షోల‌కు ప‌రిమిత‌మైన ఈ అమ్మ‌డు తాజాగా ద‌క్షిణాది సినిమాల గురించి మాట్లాడుతూ ద‌క్షిణాదిలో హీరో కంటే హీరోయిన్‌ను త‌క్కువ‌గానే చూస్తార‌ని చెప్పింది.

ఇంతకీ ఈ నటి ఎదుర్కొన్న సమస్య ఏంటంటే.. భోజనం సందర్భంలో తనను నిర్మాతలు పట్టించుకోకపోవడమే. హీరోకు భోజనం పెట్టి తనను మరిచారని పేర్కొంది. ``చాలా ఏళ్ల క్రితం నేను ఓ ద‌క్షిణాది సినిమాలో న‌టించేట‌ప్పుడు నిర్మాత‌లు ముందుగా హీరోకే భోజనాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు నేను చాలా ఆక‌లితో ఉన్నా. అయినా కూడా నిర్మాత‌లు ముందుగా హీరోకే భోజనాన్ని అందించారు. అది చూసి నేను న‌వ్వుకున్నాను. అది న‌న్ను ఏమాత్రం బాధించ‌లేదు. ఇది చాలా ఏళ్ల క్రితం జ‌రిగింది`` అని చెప్పింది నేహా ధూపియా. ఈమె తెలుగులో `నిన్నే ఇష్ట‌ప‌డ్డాను`, `విల‌న్`, `ప‌ర‌మ‌వీర‌చ‌క్ర` చిత్రాల్లో న‌టించారు. మ‌రి ఈమె ఏ దక్షిణాది హీరోను టార్గెట్‌గా చేసిందన్న విషయం బహిర్గతం కాలేదు.

More Telugu News