President Of India: దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

  • మరి కొన్ని గంటల్లో రానున్న 2020
  • కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలి
  • శాంతి, సామరస్యం కోసం అందరూ కట్టుబడి ఉండాలి

కొత్త ఆశలతో 2020 కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో శాంతి, సామరస్యం కోసం అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. మరోపక్క, అటు తూర్పు దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాలు ఇప్పటికే 2020కి స్వాగతం పలికాయి.

More Telugu News