Ramanaidu: కారంచేడులో రామానాయుడు ఇంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

  • కొన్నిరోజుల క్రితం కారంచేడులో దొంగతనం
  • నిర్మాత రామానాయుడు నివాసంలో చోరీ
  • దొంగను పట్టుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా కారంచేడులో కొన్నిరోజుల క్రితం దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు నివాసంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఇంట్లో ప్రస్తుతం రామానాయుడు సోదరుడు రామ్మోహన్ నివాసం ఉంటున్నారు. అయితే, రామ్మోహన్ దంపతులు తమ కుమార్తెలను చూసేందుకు హైదరాబాద్ వెళ్లగా, ఓ దొంగ తన పనితనం ప్రదర్శించి ఇంటిని చక్కబెట్టాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొన్నిరోజుల్లోనే దొంగను పట్టుకున్నారు. అతడి నుంచి రూ.3.60 లక్షల విలువ చేసే సొత్తును రికవరీ చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

More Telugu News