Students: చదువుకునే విద్యార్థులు రోడ్డెక్కారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలియడం లేదా?: చంద్రబాబు

  • ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం విద్యార్థుల ఆందోళన
  • పోలీసుల లాఠీచార్జి
  • స్పందించిన చంద్రబాబు

ఫీజు రీయింబర్స్ మెంట్ కోరుతూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోరుతూ విద్యార్థులు వీధుల్లోకొచ్చి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారిపై లాఠీచార్జి చేయించడం దారుణమని వ్యాఖ్యానించారు. చదువుకునే విద్యార్థులు రోడ్డెక్కారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలియడంలేదా? విద్యార్థుల చదువులు ఆగకుండా ఇకనైనా సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు.

More Telugu News