Andhra Pradesh: విజయవాడ బెరం పార్కులో ఏపీ సీఎం జగన్ కొత్త సంవత్సర వేడుకలు

  • మరి కొన్ని గంటల్లో నూతన సంవత్సరం
  • బెరం పార్కులో వేడుకలు ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారులు
  • ట్వీట్ చేసిన వైసీపీ

మరి కొన్నిగంటల్లో నూతన సంవత్సరం రాబోతోంది. 2020 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏపీ సర్కారు కూడా సిద్ధమవుతోంది. కాగా, రాష్ట్ర ఐఏఎస్ అధికారులు కొత్త సంవత్సర వేడుకలను విజయవాడ బెరం పార్కులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్ కూడా పాల్గొంటారు. ఈ మేరకు  వైసీపీ ట్వీట్ చేసింది. అంతేకాదు, తన ట్వీట్ కు 'వైఎస్ జగన్ ఈ దశాబ్దపు నేత' అంటూ ట్యాగ్ కూడా చేసింది.

More Telugu News