Thummala: తుమ్మల మాట్లాడినట్టు ఉన్న ఆడియో ఫేక్.. పోలీసులకు ఫిర్యాదు

  • ఓ నాయకుడితో తుమ్మల మాట్లాడినట్టు ఉన్న ఆడియో
  • సోషల్ మీడియాలో వైరల్
  • తుమ్మలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు

ఏపీ రాజధాని తరలింపు, కమ్మ, రెడ్డి కులాలను ఉద్దేశిస్తూ ఓ నాయకుడితో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినట్టు ఉన్న ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, ఈ ఆడియో ఫేక్ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లో పలువురు టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కావాలనే తుమ్మలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఈ ఆడియోలో కేసీఆర్, చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్, బాలకృష్ణల గురించి కూడా వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే, ఈ ఆడియోపై తుమ్మల ఇంత వరకు స్పందించలేదు.

More Telugu News