Vaishnav Tej: తెలుగు తెరకి మరో కొత్త కథానాయికగా 'కృతి శెట్టి'

  • ముగింపు దశలో 'ఉప్పెన'
  • దర్శకుడిగా బుచ్చిబాబు పరిచయం 
  • ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి

తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతున్నారు. అందం .. అభినయంతో పాటు అదృష్టం కలిసొచ్చిన వాళ్లు అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఉప్పెన' చిత్రం ద్వారా తెలుగు తెరకి 'కృతి శెట్టి' పరిచయం అవుతోంది.

చక్కని కనుముక్కుతీరుతో కట్టిపడేస్తున్న ఈ అమ్మాయి, 'ఉప్పెన' సినిమాపై చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ కొడితే యువ కథానాయకుల జోడీగా ఆమె జోరు కొనసాగడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేసే ఆలోచనలో వున్నారు.

More Telugu News