Karthikeya: 'బస్తీ బాలరాజు'గా కనిపించనున్న కార్తికేయ

  • కార్తికేయ తదుపరి సినిమాకి సన్నాహాలు 
  • దర్శకుడిగా కౌశిక్ పెగళ్లపాటి పరిచయం 
  • త్వరలో వెలువడనున్న ప్రకటన

తెలుగు తెరకి 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో కార్తికేయ పరిచయమయ్యాడు. ఈ సినిమాతో ఆయన యూత్ నుంచి .. మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ అవి తొలి సినిమా స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి. ఇటీవల వచ్చిన '90 ML' సినిమా పరిస్థితి కూడా అదే.

ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నాడు. బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. 'చావు కబురు చల్లగా' అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఈ సినిమాలో 'బస్తీ బాలరాజు' పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో కార్తికేయ సరసన నాయికగా లావణ్య త్రిపాఠి నటించనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

More Telugu News