Lavanya Tripathi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • కార్తికేయకు నాయికగా లావణ్య 
  • తొలి షెడ్యూలు పూర్తి చేసిన గోపీచంద్ 
  • 'సరిలేరు నీకెవ్వరు'కి రీరికార్డింగ్  

*  ఇటీవల 'అర్జున్ సురవరం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాలతార లావణ్య త్రిపాఠి తాజాగా కార్తికేయ సరసన హీరోగా నటించడానికి ఓకే చెప్పింది. దీనికి నూతన దర్శకుడు కౌశిక్ దర్శకత్వం వహిస్తాడు.
*  యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ పూర్తయింది. పదిహేను రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూలులో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించామని దర్శకుడు తెలిపారు. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తోంది.
*  మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి సంబంధించిన రీరికార్డింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దీనికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నట్టు చెబుతున్నారు.  

More Telugu News