Kerala: ఇది మా హక్కు.. కేరళలో 8 వేల మంది మహిళల నైట్ వాక్!

  • ఈ నెల 29న తిరువనంతపురంలో భారీ నైట్ వాక్
  • పాల్గొన్న మంత్రి కేకే శైలజ
  • అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

కేరళ ప్రభుత్వం ఆదివారం రాత్రి తిరువనంతపురంలో నిర్వహించిన ‘నైట్‌వాక్’లో 8 వేల మంది మహిళలు పాల్గొన్నారు. అన్ని వయసుల అమ్మాయిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘పొతు ఇదం ఎంతెతుం’ పేరుతో మహిళ, శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేకే శైలజ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో నిర్భయంగా తిరుగాడే హక్కుపై మహిళలను చైతన్య పరిచేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు, కాసర్‌గఢ్‌లో నిర్వహించిన నైట్ వాక్‌లో పాల్గొన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 39 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News