Andhra Pradesh: రాజధాని పరిస్థితులు, పరిశీలన... పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్

  • మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
  • అన్ని ప్రాంతాల నేతలు హాజరు
  • అందరి అభిప్రాయాలు ఆలకించిన జనసేనాని

జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. జనసేనాని పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అమరావతి రాజధాని... ప్రస్తుత పరిస్థితులు, పరిశీలన అనే పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. కాగా, పార్టీ సమావేశంలో అన్ని ప్రాంతాల నేతలను పిలిపించిన పవన్ వారు చెప్పిన అభిప్రాయాలను శ్రద్ధగా వినడమే కాదు ఓ పుస్తకంలో రాసుకోవడం కనిపించింది.

More Telugu News