RSS: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై టీ-కాంగ్రెస్ నేత వీహెచ్ ఫిర్యాదు

  • దేశంలోని 130 కోట్ల మంది హిందువులేనన్న భగవత్
  • ఈ వ్యాఖ్యలతో ఇతర మతాలవారి మనోభావాలు దెబ్బతిన్నాయి
  • ఎల్బీనగర్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన వీహెచ్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై  టీ-కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఫిర్యాదు చేశారు. దేశంలోని 130 కోట్ల మంది హిందువులేనన్న ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఈ మేరకు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇతరమతాల వారి మనోభావాలను కించపరిచారని ఆరోపించారు. కాగా, ఈ నెల 25న హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోని మైదానంలో ఆర్ఎస్ఎస్ సభ జరిగింది. ఈ సభలో మోహన్ భగవత్ పాల్గొన్నారు.

More Telugu News