Prabhas: 'నిశ్శబ్దం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప్రభాస్

  • అనుష్క ప్రధాన పాత్రధారిగా 'నిశ్శబ్దం'
  • ప్రభాస్ తో వరుస సినిమాలు చేసిన అనుష్క 
  • ఇద్దరి మధ్య మంచి స్నేహం 

అనుష్క ప్రధాన పాత్రధారిగా 'నిశ్శబ్దం' చిత్రం రూపొందింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, కోన వెంకట్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. అనుష్క అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉండగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ప్రభాస్ రానున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ - అనుష్క మధ్య మంచి స్నేహం వుంది. ఇద్దరూ కలిసి వరుస సినిమాల్లో నటించడం వలన ఆ స్నేహం మరింత బలపడింది. అందువల్లనే అనుష్క సినిమా ప్రమోషన్ కి సంబంధించిన విషయం కావడంతో ముఖ్య అతిథిగా రావడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ వేడుకను ఏ తేదీన నిర్వహించినా .. ఎక్కడ జరిపినా తప్పకుండా వస్తానని ప్రభాస్ మాట ఇచ్చాడట. దాంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News