Paripoornananda: తిరుమల నుంచి అమరావతికి పాదయాత్ర: పరిపూర్ణానంద స్వామి

  • హిందుత్వంలో అన్య మతస్తులు
  • పట్టీ పట్టనట్టు చూస్తున్న పాలకులు
  • తిరుమలలో పరిపూర్ణానంద ఆరోపణ

హిందూమతంలోకి అన్య మతస్తులు ప్రవేశిస్తుంటే పాలకులు పట్టీ పట్టనట్టుగా చూస్తున్నారని పరిపూర్ణానంద స్వామి ఆరోపించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను తిరుమల నుంచి అమరావతి వరకూ పాదయాత్రగా వెళ్లి, ముఖ్యమంత్రిని కలిసి మెమొరాండం సమర్పించనున్నట్టు తెలిపారు. ప్రతి రాజకీయ నాయకుడికీ హిందువుల ఓట్లు కావాలే తప్ప , హిందూ ధర్మం పట్టడం లేదని ఆరోపించారు. టీటీడీలో హైందవేతర ఉద్యోగులను తక్షణం బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News