Roja: ఫ్యామిలీతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న రోజా!

  • సోషల్ మీడియాలో వెల్లడించిన రోజా
  • న్యూ ఇయర్ గోవాలోనే
  • వైరల్ అవుతున్న ఫొటోలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా, తన కుటుంబంతో కలిసి గోవా పర్యటనలో ఉన్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించిన ఆమె, ఎయిర్ పోర్టు, గోవాలో తీసుకున్న సెల్ఫీ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ శీతాకాలంలో గోవా టూర్ కు వెళుతున్నట్టు ఆమె ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకలను రోజా ఫ్యామిలీ, గోవాలోనే జరుపుకుంటుందని తెలుస్తోంది. రోజా పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూడండి.

More Telugu News