Makara Jyothi: 14న కాదు... 15న మకరజ్యోతి దర్శనం: శబరిమల పూజారుల స్పష్టీకరణ

  • 15న మకర సంక్రమణం
  • అదే రోజున జ్యోతి దర్శనం
  • 21న మూసుకోనున్న ఆయ్యప్ప గర్భాలయం తలుపులు

రెండు రోజుల క్రితం మండల పూజలు ముగిసిన అనంతరం మూసుకున్న కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం తలుపులు నేడు మకర విళక్కు కోసం తెరచుకోనున్నాయి. సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం స్వామి గర్భాలయాన్ని అధికారులు తెరవనున్నారు. ఈ సంవత్సరం జనవరి 15న మకర సంక్రమణం జరుగనున్నందున, ఆ రోజునే మకరజ్యోతి దర్శనం ఇస్తుందని, జ్యోతి దర్శనం కోరే భక్తులు గమనించాలని ఆలయ పూజారులు, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కోరింది. ఆపై ఐదు రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుందని, స్వామి దర్శనాలు 20వ తేదీ వరకూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. 21న ఆలయాన్ని మూసివేస్తామని వెల్లడించారు.

More Telugu News