Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • యూరప్ పర్యటనలో పూజా హెగ్డే 
  • కొత్త దర్శకుడికి నాని గ్రీన్ సిగ్నల్ 
  • యూ ట్యూబ్ స్టార్ హీరోగా 'కలర్ ఫొటో'

*  ఈ ఏడాదంతా తెలుగు సినిమాలతో బిజీగా వున్న కథానాయిక పూజా హెగ్డే ఇటీవలే 'అల వైకుంఠపురములో' చిత్రం షూటింగును పూర్తి చేసింది. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి యూరప్ పర్యటనకు వెళ్లింది. నూతన సంవత్సర ఆగమనాన్ని అక్కడే జరుపుకుని వస్తుందట.
*  ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో 'వి' చిత్రాన్ని చేస్తున్న హీరో నాని తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పాడు. క్రిష్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన అనిల్ అనే కుర్రాడు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
*  గతంలో 'హృదయ కాలేయం', 'కొబ్బరి మట్ట' వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత సాయి రాజేశ్ తాజాగా 'కలర్ ఫొటో' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూట్యూబ్ స్టార్ సుహాస్, చాందిని చౌదరి జంటగా నూతన దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను తాజాగా హీరో నాని విడుదల చేశాడు.  

More Telugu News