Amit Shah: అమిత్ షాపై అకస్మాత్తుగా అంత గౌరవం ఎందుకు కలిగిందో పవన్ కల్యాణ్ నే అడగాలి: కన్నా

  • పవన్ బీజేపీ అనుకూల వ్యాఖ్యలు
  • స్పందించిన కన్నా
  • నిజం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ మోదీ పక్షాన నిలుస్తారని వ్యాఖ్యలు

ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ అధినాయకత్వంపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. అమిత్ షాపై ఉన్నట్టుండి అంత గౌరవం ఎందుకు కలిగిందో, ఆయన నాయకత్వంపై అంత నమ్మకం ఎలా ఏర్పడిందో పవన్ కల్యాణ్ నే అడగాలని అన్నారు. పవన్ కల్యాణ్ మాత్రమే కాదని, నిజం తెలుసుకున్న రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ పక్షాన నిలుస్తారని తెలిపారు. ఇక, జనసేన పార్టీ బీజేపీలో విలీనం అంశం తనకు తెలియదని, ఇవన్నీ అవగాహన లేకుండా చేసిన వ్యాఖ్యలు అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ బీజేపీలో కలిసిపోతుందన్న ప్రచారంపై ఇప్పుడు చర్చించడం అంత సబబు కాదని కన్నా స్పష్టం చేశారు.

"పవన్ ఓ పార్టీ పెట్టాడు, దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు సమర్థుడా, అసమర్థుడా అనేది ప్రజలు తేల్చాల్చిన విషయం. నేను చెప్పలేను" అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News