DGP: డీజీపీకి ఫిర్యాదు చేసిన టీవీ9 ప్రతినిధి దీప్తి!

  • అమరావతి ప్రాంతం నుంచి రిపోర్టింగ్
  • రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్నట్టుగా ప్రచారం
  • దీప్తిపై దాడికి దిగిన మహిళలు

సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీవీ9 యాంకర్ దీప్తి డీజీపీకి ఫిర్యాదు చేసింది. తాను అనని మాటలను అన్నట్టుగా పాత వీడియోలను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారని, ఆరోపించింది. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది.

కాగా, అమరావతి ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్న మహిళల వద్ద నుంచి రిపోర్టింగ్ చేస్తున్న దీప్తి, పెయిడ్ ఆర్టిస్టుల ఆందోళన అని వ్యాఖ్యానించిందని ఆరోపిస్తూ, ఆమెపై దాడి చేసిన సంగతి తెలిసిందే. తమ స్వగ్రామంలో తాము ధర్నా చేస్తుంటే, దీప్తి పెయిడ్ ఆర్టిస్టులని చెప్పడాన్ని పలువురు మహిళలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ దాడిలో నిరసనకారులు మీడియా వాహనాలనూ ధ్వంసం చేశారు. ఆపై దీప్తికి బెదిరింపు కాల్స్ వెళ్లాయి. పలు దీప్తి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

More Telugu News