Odisha: షాపింగ్ మాల్ లో అక్రమాలు బయటపెడుతున్నందుకు మహిళా జర్నలిస్టుపై దాడి

  • ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని భోమిఖల్ లో ఘటన
  • అక్రమంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్న షాపింగ్ మాల్
  • సీసీటీవీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తున్నపోలీసులు

మహిళా జర్నలిస్టుపై ఓ షాపింగ్ మాల్ ఉద్యోగులు దాడి చేసిన ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని భోమిఖల్ లో చోటు చేసుకుంది. ఆ షాపింగ్ మాల్ లో అక్రమంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి మహిళా జర్నలిస్టు స్వాతి జేనా ఓ రిపోర్టర్ తో కలిసి వెళ్లింది. ఈ సమయంలోనే ఈ దాడి జరిగింది.

ఈ ఘటనపై సహీద్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అక్కడి సీసీటీవీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్వాతి మాట్లాడుతూ... 'నాతో పాటు కెమెరా పర్సన్ పై వారు దాడి చేశారు. మా కెమెరాలను ధ్వంసం చేశారు' అని తెలిపింది.

More Telugu News