Egypt: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయుడి సహా ఆరుగురి దుర్మరణం

  • వెనక నుంచి వచ్చి ఢీకొట్టిన ట్రక్కు
  • 26 మంది పర్యాటకులతో వెళ్తున్న బస్సు
  • మృతుల్లో ఇద్దరు మలేషియా, ముగ్గురు ఈజిప్ట్ వాసులు

ఈజిప్టులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయుడు సహా ఆరుగురు దుర్మరణం చెందారు. భారత్‌కు చెందిన 26 మంది పర్యాటకులతో కూడిన బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. సోఖ్నా-ఝఫరానా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. రెండు బస్సుల్లో పర్యాటకులు బయలుదేరగా మొదటి బస్సును ట్రక్కు ఢీకొంది.

ఈ క్రమంలో వెనక వస్తున్న బస్సు ట్రక్కును ఢీకొంది. రెండో బస్సులో ఆస్ట్రేలియా పర్యాటకులు ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఒకరు భారత్, ఇద్దరు మలేషియా, ముగ్గురు ఈజిప్టు వాసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు కైరోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రమాద ఘటనను కైరోలోని రాయబార కార్యాలయం ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.

More Telugu News