Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో దారుణం.. యువతిని బెదిరించి ఐదు నెలలుగా అత్యాచారం

  • నిందితుల్లో పెదనాన్న కొడుకు
  • యువతి గర్భం దాల్చడంతో విషయం బయటకు
  • పరారీలో ఉన్న నిందితుల కోసం మొదలైన వేట

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో దారుణం జరిగింది. పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతిని బెదిరించిన ఇద్దరు యువకులు గత ఐదు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. యువతి గర్భం దాల్చడంతో తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కూలి పనులు చేసే యువతి తల్లిదండ్రులు రోజూ పనులకు వెళ్లేవారు. దీంతో యువతి ఇంట్లో ఒంటరిగా ఉండేది.

ఇది గమనించిన యువతి ఇంటి సమీపంలోనే నివసించే ఆమె పెదనాన్న కుమారుడు నవీన్ (25), స్నేహితుడు రవి (22)తో కలిసి ఆమె ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు. ఐదు నెలలుగా ఈ దారుణం జరుగుతుండగా తాజాగా, ఆమె గర్భం దాల్చింది. దీంతో నివ్వెరపోయిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News