Train: రైలు ప్రయాణంలో పరిమళించిన మానవత్వం... గర్భిణీకి పురుడుపోసిన సైనిక వైద్యాధికారులు

  • రైల్లో గర్భవతికి నొప్పులు
  • అదే రైల్లో ప్రయాణం చేస్తున్న ఆర్మీ మహిళా వైద్యాధికారులు
  • గర్భవతికి వైద్య సేవలు
  • పండంటి బిడ్డను కన్న యువతి

రైల్లో ప్రయాణిస్తున్న ఓ గర్భవతి పాలిట మహిళా సైనిక వైద్యాధికారులు దేవతల్లా పరిణమించారు. నిండు గర్భిణీ అయిన ఆ యువతి హౌరా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుండగా, ఉన్నట్టుండి నొప్పులు మొదలయ్యాయి. కదులుతున్న రైల్లో నొప్పులు పడుతున్న ఆమెను ఇద్దరు ఆర్మీ వైద్యాధికారులు ఆదుకున్నారు. కెప్టెన్ అమన్ దీప్, కెప్టెన్ లలిత ఆ గర్భవతికి ప్రసవం సాఫీగా అయ్యేలా వైద్యసేవలు అందించారు. ఆ యువతి పండంటి బిడ్డను కనడంతో ఆ యువ ఆఫీసర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇతర ప్రయాణికులు కెప్టెన్ లలిత, కెప్టెన్ అమన్ దీప్ లను అభినందించారు. ఈ విషయాన్ని ఆర్మీ సోషల్ మీడియాలో వెల్లడించింది.

More Telugu News