Andhra Pradesh: ప్రపంచ తెలుగు మహాసభలకు పాకిన 'రాజధాని' నిరసనలు

  • ఏపీ రాజధానిపై రగడ
  • రైతుల ఆందోళన
  • తెలుగు మహాసభల్లో ప్లకార్డుల ప్రదర్శన

విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క, ఏపీ రాజధాని మార్పు ఉండొచ్చని ప్రభుత్వం సూచనప్రాయంగా తెలపడంతో రాజధాని రైతులు గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా, రైతుల నిరసన సెగలు ప్రపంచ తెలుగు మహాసభల వరకు పాకాయి. ఈ సభలో రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. 'రచయితలారా, రాజధాని రైతులకు మద్దతు ఇవ్వండి' అంటూ ప్లకార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు.

More Telugu News