Nara Lokesh: విశాఖ వెళ్లేది మీ ల్యాండ్‌ మాఫియా కోసమేగా?: ట్విట్టర్‌లో జగన్ కు లోకేశ్ సూటి ప్రశ్న

  • స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని చంపేస్తారా?
  • రాజధానిని ఎలా అభివృద్ధి చేయొచ్చో బాబు చెప్పారు కదా
  • ఆ మాటలు ఎందుకు పట్టించుకోరు?

అద్భుత రాజధానిగా అమరావతిని ఎలా తీర్చిదిద్దవచ్చునో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెబుతున్నా, లక్ష కోట్ల ఖర్చు సాకుతో విశాఖవైపు చూస్తున్నది మీ ల్యాండ్‌ మాఫియా కోసమే కదా? అని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు నారా లోకేశ్  ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ సందేశం ఉంచారు. మీ స్వార్థం కోసం అమరావతిని చంపేయడం ఎంత వరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు.

More Telugu News