Rajanikanth: 'దర్బార్' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు

  • విడుదలకి ముస్తాబవుతున్న 'దర్బార్'
  • తమిళ .. తెలుగు భాషల్లో ఒకే రోజున విడుదల 
  •  ప్రతినాయకుడిగా కనిపించనున్న సునీల్ శెట్టి

మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా 'దర్బార్' చిత్రం రూపొందింది. రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన నయనతార కనిపించనుంది. తమిళంతోపాటు తెలుగులోను ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదు - 'శిల్పకళా వేదిక'లో జరపనున్నారు. జనవరి 3వ తేదీన ఈ వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి నటించగా, నివేద థామస్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.

More Telugu News