RTC merging in Govt: ఏపీ ఆర్టీసీ విలీనానికి గవర్నర్ ఆమోదం!

  • విలీన చట్టానికి సంబంధించిన దస్త్రంపై సంతకం చేసిన గవర్నర్ విశ్వభూషణ్
  • త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేయనున్న ప్రభుత్వం
  • హర్షం వ్యక్తం చేసిన ఆర్టీసీ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం జగన్ సర్కారు నిర్ణయం చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం అధికారికంగా అమలుకు రంగం సిద్ధమైంది. తాజాగా ఈ చట్టానికి గవర్నర్‌ విశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన దస్త్రంపై ఆయన సంతకం చేశారు. త్వరలోనే ఈ విలీనంపై గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనున్నది. దీంతో ఈ చట్టం అమల్లోకి రానుంది. రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు దీనిపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

More Telugu News