Andhra Pradesh: రాజధానిగా ఏ పేరు రాసుకోవాలన్న మీడియా ప్రతినిధి... సమాధానం దాటవేసిన మంత్రి పేర్ని నాని!

  • మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం
  • ముగిసిన క్యాబినెట్ భేటీ
  • రిపోర్టర్ అడిగిన ప్రశ్నతో ఇబ్బందికి గురైన పేర్ని నాని!

ఏపీ క్యాబినెట్ భేటీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మంత్రి పేర్ని నాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ చానల్ ప్రతినిధి, ఏపీ రాజధానిగా ఏ పేరు రాసుకోవాలని మంత్రిని అడిగారు. దానికి మంత్రి కాస్తంత ఇబ్బందికి గురయ్యారు. మీ పేరేంటి? మీదే చానల్? రాజధాని పేరు మీరు ఎప్పుడు రాసుకుంటారు? అంటూ అసహనంతో తిరిగి ప్రశ్నించారు. దాంతో ఆ మీడియా ప్రతినిధి నెల రోజుల తర్వాత రాసుకోవడానికి అడుగుతున్నాం అని బదులివ్వగా, అప్పుడు రండి చెబుతాం అంటూ సమాధానం వెల్లడించకుండానే ఆ మీడియా ప్రతినిధికి నిరాశ కలిగించారు.

More Telugu News