kannababu: ముగిసిన మంత్రి వర్గ సమావేశం... జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించామన్న మంత్రి కన్నబాబు

  • బీసీజీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది
  • రెండు నివేదికలపై చర్చించాకే రాజధానిపై నిర్ణయం 
  • కాసేపట్లో మంత్రి పేర్ని నాని అన్ని విషయాలు వెల్లడిస్తారు

ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో మంత్రులు వివిధ అంశాలపై రెండు గంటల పాటు చర్చించారు. ఇందులో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై వివరాలు వెల్లడి కానున్నాయి.

సమావేశం అనంతరం మంత్రి కన్నబాబు మీడియాతో కాసేపు మాట్లాడారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చించామని చెప్పారు. బీసీజీ నివేదిక ఇంకా రావాల్సి ఉందని అన్నారు. రెండు నివేదికలపై చర్చించాకే రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. నివేదిక అందాక ఏం చేయాలన్న విషయంపై సమావేశం అవుతామన్నారు. కాసేపట్లో మంత్రి పేర్నినాని మీడియా సమావేశం నిర్వహించి మిగతా విషయాలు వెల్లడిస్తారని ఆయన చెప్పారు.

More Telugu News