Allu Arjun: 'అల వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు

  • త్రివిక్రమ్ తో బన్నీ మూడో సినిమా
  • వచ్చేనెల 6వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • 12వ తేదీన భారీ స్థాయి విడుదల

త్రివిక్రమ్ దర్శకత్వంలో .. అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందింది. 'టబు' కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి తేదీని ఖరారు చేశారు. వచ్చేనెల 6వ తేదీన ఈ వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. పలువురు సినీ ప్రముఖులు .. అభిమానుల సమక్షంలో హైదరాబాదులోనే ఈ వేడుకను జరపనున్నారు.

హైదరాబాదులో వేదిక ఎక్కడ అనేది రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నారు. తమన్ అందించిన బాణీలకు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాతో బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ - బన్నీ కలిసి హ్యాట్రిక్ హిట్ కొడతారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.

More Telugu News