Devineni Uma: గొల్లపూడిలో దేవినేని ఉమను అరెస్ట్ చేసిన పోలీసులు

  • అమరావతి రైతులకు దేవినేని ఉమ మద్దతు
  • రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసిన ఉమ
  • పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి రైతుల ఆందోళనకు సంఘీభావంగా దేవినేని ఉమ గొల్లపూడిలో రోడ్డుపై బైఠాయించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు తరలివచ్చారు.

ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసనలకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు, దేవినేని ఉమను అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో, గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

More Telugu News