Kesineni Nani: మన జగన్ అన్న పిచ్చి తుగ్లక్ కంటే 20 రెట్లు పిచ్చోడు: కేశినేని నాని

  • అమరావతి నుంచి రాజధాని మార్చడం సరికాదు
  • సీనియర్ పాత్రికేయుడు శేఖర్ గుప్తా తేల్చి చెప్పారు
  • వీడియో పోస్ట్ చేసిన కేశినేని నాని

అమరావతి నుంచి ఏపీ రాజధానిని తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో.. అమరావతి ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్ పై కేశినేని నాని విమర్శలు గుప్పించారు. 'అమరావతి నుంచి రాజధాని మారుస్తున్న మన జగన్ అన్న పిచ్చి తుగ్లక్ కంటే 20 రెట్లు పిచ్చోడు అని సీనియర్ పాత్రికేయుడు శేఖర్ గుప్తా తేల్చి చెప్పారు' అంటూ ఆయన ఓ వీడియోను ట్వీట్ చేశారు.

రాజధాని కోసం 33,000 ఎకరాల భూములు సేకరించిన తర్వాత ఇప్పుడు రాజధాని మారుస్తున్నారంటూ ఆ వీడియోలో శేఖర్ గుప్తా తెలిపారు. ఇన్ని ఎకరాలు సేకరించినప్పటికీ రాజధాని నిర్మాణం ఆగిపోయిందని విమర్శించారు. విషపూరిత రాజకీయాల వల్ల రాజధాని నిర్మాణం ఆగిపోతోందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News