Mahesh Babu: మహేశ్ బాబుతో నా సినిమా ఉంటుంది: దర్శకుడు పరశురామ్

  • 'గీత గోవిందం'తో భారీ విజయం 
  • తదుపరి సినిమా నాగచైతన్యతో 
  •  మహేశ్ తోను ఖాయం చేసుకున్న పరశురామ్

'గీత గోవిందం' సంచలన విజయాన్ని సాధించడంతో, పరశురామ్ అనే పేరు పరిచయం అవసరం లేనిదిగా మారిపోయింది. ఆ వెంటనే ఆయన తదుపరి సినిమా ఉంటుందని అంతా భావించారు. అయితే అలా జరగలేదు .. ఆయన అనుకున్న ప్రాజెక్టులు చివరి నిమిషంలో పక్కకి పోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. మొత్తానికి ఆయన తదుపరి సినిమా నాగచైతన్యతో వుండనుందనే వార్త ఇటీవల బయటికి వచ్చింది.

ఆ తరువాత సినిమా మహేశ్ బాబుతో వుండనుందనేది తాజా సమాచారం. ఈ విషయంలో వ్యక్తమవుతున్న సందేహాలపై పరశురామ్ స్పందించాడు. మహేశ్ బాబుతో తన సినిమా ఉంటుందని స్పష్టత ఇచ్చాడు. ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా పనులతో బిజీగా వున్న మహేశ్ బాబు, ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాతనే మహేశ్ బాబు - పరశురామ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.

More Telugu News